News March 27, 2025
మరోసారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు వర్ధన్ రెడ్డి

సంగారెడ్డి బార్ అసోసియేషన్లో గురువారం జరిగిన ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి మహేశ్, సంయుక్త కార్యదర్శిగా ఎన్ మల్లేశం, క్రీడల కార్యదర్శిగా టి శ్రీనివాస్, గ్రంధాలయ కార్యదర్శిగా నిజాముద్దీన్ రషీద్, మహిళ ప్రతినిధిగా మంజుల రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బుచ్చయ్య, సుభాష్ చందర్, నరసింహ, మాణిక్ రెడ్డి ఎన్నికయ్యారు.
Similar News
News December 9, 2025
ఈ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయవద్దు: సుర్యాపేట ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యపేట, ఆత్మకూర్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల సమయం ముగిసిందని ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా చేరవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 9, 2025
సూర్యాపేట: ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం

సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.


