News July 19, 2024

మరోసారి సంజూ శాంసన్‌కు మొండిచేయి!

image

ప్రతిసారిలాగే ఈ సారి కూడా టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అవకాశమిచ్చిన సెలక్టర్లు వన్డేలకు మాత్రం మొండిచేయి చూపారు. భారత్ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో శాంసన్ సెంచరీ చేశారు. అయినా ఆయనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దూబే లేదా పరాగ్‌లలో ఎవరో ఒకరి స్థానంలో సంజూకు చోటివ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News December 8, 2025

CHROME వాడుతున్నారా?.. యాపిల్ హెచ్చరిక

image

గూగుల్ క్రోమ్ వాడే ఐఫోన్ యూజర్లను యాపిల్ సంస్థ హెచ్చరించింది. Chrome బ్రౌజర్ ‘డివైజ్ ఫింగర్‌ప్రింటింగ్’ అనే రహస్య ట్రాకింగ్ పద్ధతి ద్వారా యూజర్ల కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని పేర్కొంది. దీనిని ఆఫ్ చేసే అవకాశం యూజర్లకు లేదని తెలిపింది. అలాగే Safariలో ‘Try App’ లింక్‌లను నొక్కితే Google App ఓపెన్ అవుతోందని తద్వారా మరింత డేటాను సేకరిస్తుందని అభిప్రాయపడింది. Safari బ్రౌజర్ సేఫ్ అని స్పష్టం చేసింది.

News December 8, 2025

పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

image

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.

News December 8, 2025

CBSE తరహాలో టెన్త్ ఎగ్జామ్స్?.. షెడ్యూల్‌పై ఉత్కంఠ

image

TG: CBSE తరహాలో పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి SSC పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు 2, 3 రోజులు గ్యాప్‌ ఉంచి 2 రకాల షెడ్యూళ్లను CMOకు పంపారు. మధ్యలో రంజాన్, ఉగాది, మహవీర్ జయంతి, శ్రీరామ నవమి ఉండడంతో 4 రోజుల వ్యవధీ ఉండనుంది. ఈ ప్రతిపాదనలపై CM నిర్ణయం తీసుకోకపోవడంతో పరీక్ష తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ షెడ్యూల్ వెలువడిన వారంలోగా టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రావాల్సి ఉండగా నెలరోజులవుతున్నా తేలలేదు.