News June 27, 2024
మరో 48 గంటల పాటు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు

ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 48 గంటలు వరకూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం, రాత్రివేళ వర్షాలు జోరందుకోనున్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్ పనులకు ఉపకరిస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉంది.
Similar News
News October 17, 2025
విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
News October 17, 2025
మెడిసిన్ ధరలు తగ్గుదలపై అందరికీ అవగాహన అవసరం: డీఎంహెచ్ఓ

ప్రజలు నిత్యం వినియోగించే మెడిసిన్ ధరలపై అవగాహన అవసరమని జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ కె. అనిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీఎస్టీ సవరణల వలన మందులపై ధరలు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గాయని ఆమె తెలిపారు. క్లినిక్లు, మెడికల్ షాపుల వద్ద తగ్గిన ధరల పట్టికలను బోర్డుల రూపంలో ప్రదర్శించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 16, 2025
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన నాగబాబు

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ను ఎమ్మెల్సీ నాగబాబు సందర్శించారు. కాంప్లెక్స్ ఆవరణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంపై ఆరా తీస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్, నాయకులు ఉన్నారు.