News February 27, 2025

మర్కుక్ రావాలని KCRకు ఆహ్వానం

image

మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్‌లోని పురాతన దేవాలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలకు రావాలని గురువారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి అంగడికిష్టాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్, శ్రీ ఉమామహేశ్వర దేవాలయం ఛైర్మన్ ఆహ్వాన పత్రిక అందజేశారు. 

Similar News

News September 16, 2025

మిడ్జిల్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో 167 హైవేపై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. చిల్వర్ గ్రామానికి చెందిన రాములు బైక్ వెళ్తూ ఆగి ఉన్న బొలెరోను ఢీన్నాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

image

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 16, 2025

మియాపూర్: డ్యూటీలో గుండెపోటుతో కండక్టర్ మృతి

image

మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కండక్టర్ పండరి గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. సహోద్యోగులతో సరదాగా మాట్లాడుతూ పండరి వాష్‌రూమ్‌కి వెళ్లొస్తానని వెళ్లాడు. వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.