News April 10, 2024
మర్కూక్: రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి కోమటిరెడ్డి

రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్గొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్కూక్ మండలం చేబర్తి, నర్సన్నపేట గ్రామాల రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని, సీఎం దృష్టికి మీ సమస్య తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News December 1, 2025
MDK: అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరి: కలెక్టర్

స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలని, అన్ని లావాదేవీలు ఆ ఖాతా ద్వారా జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, పాత కుల సర్టిఫికెట్ కూడా చెల్లుబాటు అవుతుందని అన్నారు. సమస్యల కోసం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
News December 1, 2025
MDK: 15 హామీలతో అభ్యర్థి బాండ్ పేపర్

హవేలి ఘనపూర్ మండలం రాజుపేట్ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనిక 15 హామీలతో బాండ్ రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. 6 నెలలలోపు కొత్త ట్రాలీ కొని చెత్తసేకరణ, వృద్దులకు ఇంటివద్దకే పింఛన్ పంపిణీ, రోజు మంచినీటి సరఫరా, కొత్తగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి రూ.లక్ష లోన్ మంజూరు,
గిరిజనుల తీజ్ పండుగకు ఏడాదికి రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు ఇలా హామీలను బాండ్పై రాసి ప్రచారం చేస్తున్నారు.
News December 1, 2025
మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్ను ఎస్పీ అభినందించారు.


