News March 11, 2025
మర్పల్లి: పాఠశాల ఎదుట ఉద్యోగి ఆందోళన

చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినందున ఉద్యోగం నుంచి తీసేశారని మర్పల్లి ఆదర్శ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న మహేశ్ కుమార్ వాపోయారు. తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కుటుంబీకులతో కలిసి పాఠశాల ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 2న చికిత్స కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరానని, అధికారులు తన స్థానంలో వేరేవారిని నియమించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Similar News
News November 4, 2025
కూటమి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది: జగన్

కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రూ. 40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సింది పోయి, కేవలం రూ.5 వేలు ఇచ్చి రైతు వెన్ను విరిచారు అని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఉచిత ఇన్సూరెన్స్ ఉండేదని, ఇప్పుడు ఎరువులు కూడా బ్లాక్లో కొనే పరిస్థితి వచ్చిందని, రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
News November 4, 2025
తిరుపతి: విధుల నుంచి ఇద్దరు టీచర్లు తొలగింపు

తిరుపతి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు 3 సంవత్సరాలుగా సమాచారం లేకుండా ఉద్యోగానికి రావడం లేదు. శ్రీకాళహస్తి మండలం ఓబులేలపల్లి ZP హైస్కూల్ వ్యాయమ ఉపాధ్యాయుడు ఏ.బాలకృష్ణ. రేణిగుంట మండలం గుండ్లకలువ MPPS SGT టీచర్ పి.దేవరాజును ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
News November 4, 2025
జిల్లాలో 64,160 పశువులకు వ్యాధినివారణ టీకాలు

జిల్లాలో 64160 పశువులకు గాలికుంటు వ్యాధినివారణ టీకాలు వేసినట్లు, దీంతో 14383 మంది రైతులు లబ్ధిపొందినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి కుమారస్వామి తెలిపారు. మంగళవారం పశువైద్యశాఖ డాక్టర్లు, సిబ్బందితో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 14 వరకు టీకాల కార్యక్రమం సాగుతుందని, జిల్లాలో 132285 పశువులు ఉన్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారి కోరారు.


