News December 19, 2024

మర్రిపూడి: చనిపోయిన వారి పేరుతో డబ్బులు నొక్కేశారు

image

మర్రిపూడి మండలంలో ఉపాధి హామీ పనుల్లో మృతుల పేర్లతో నిధులు స్వాహా చేశారు. ఈ ఉదంతం బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో డ్వామా PD జోసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావేదికలో వెలుగులోకి వచ్చింది. మండలంలో 569 పనులుకు రూ.7,52,57,643 ఖర్చు చేసినట్లు చెప్పారు. కొన్ని గ్రామాల్లో జరిగిన ఉపాది పనుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించి ప్రజావేదిక దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన PD నిధులు రికవరీకి ఆదేశించారు.

Similar News

News September 19, 2025

నేడు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం

image

ప్రకాశం జిల్లాలో శుక్రవారం పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. జిల్లాకు వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News September 19, 2025

IT కోర్ సెంటర్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన SP

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు గురువారం IT కోర్ సెంటర్, కంట్రోల్ రూమ్ సెంటర్లను సందర్శించారు. సిబ్బంది పని తీరు, విధులపై ఆరా తీశారు. CCTNS, CDR, సైబర్ క్రైమ్ అప్డేట్స్, అప్లికేషన్లపై సిబ్బందితో చర్చించారు. పలు ఫైల్స్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలను త్వరితగతిన అందించాలన్నారు.

News September 18, 2025

శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు: SP

image

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని SP హర్షవర్ధన్‌రాజు సూచించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో అదనపు SPలు, DSPలు, CI, SIలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.