News November 20, 2024

మర్రిపూడి: భార్య అంత్యక్రియలు చేసిన కాసేపటికి భర్త మృతి

image

మర్రిపూడి మండలం చెంచిరెడ్డిపల్లెలో విషాదకర ఘటన జరిగింది. భార్య తిరుపాలమ్మ(75) అంత్యక్రియలు ముగిసిన కాసేపటికి దిబ్బారెడ్డి (85) మృతి చెందాడు. భార్య అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మృతి చెందగా.. మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. స్మశాన వాటిక నుంచి ఇంటి కొచ్చిన కాసేపటి దిబ్బారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News November 26, 2025

29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

image

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.

News November 26, 2025

29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

image

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.

News November 26, 2025

ప్రకాశం: తుఫాన్‌ను లెక్కచేయని వనిత.. అసలు స్టోరీ ఇదే!

image

నాగులుప్పలపాడు మండలం పోతవరానికి చెందిన మహిళా రైతు వనిత.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2021 నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్న ఆమె అద్భుత విజయాలు సాధించారు. ప్రస్తుతం మొక్కజొన్న, కంది, బీరకాయ పంటలను 2.20 ఎకరాల భూమిలో సాగు చేశారు. మొన్న మొంథా తుఫాన్‌తో మిగిలిన రైతుల పంట దెబ్బతింటే, ఈమె పంట సేఫ్. దీంతో రూ.8500 పెట్టుబడి ఖర్చుకు రూ.53,460 ఆదాయం గడించారు.