News April 9, 2025

మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే తీవ్రంగా ప్రస్తుత మలేరియా ఉంటుందని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.

Similar News

News November 16, 2025

అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్‌లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.

News November 16, 2025

సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 58.42 లక్షల రికవరీ

image

సంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్ అదాలతో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 58.42 లక్షలు బాధితులకు అందించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మొత్తం 1,134 కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని పేర్కొన్నారు.

News November 16, 2025

కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

image

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.