News April 9, 2025

మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే మలేరియా తీవ్రమయ్యే అవకాశం ఉండవచ్చని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 23, 2025

ఏలూరు జిల్లాకు పవన్.. పటిష్ఠ బందోబస్తు

image

ఐ.ఎస్‌.జగన్నాధపురంలో సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లపై, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏఎస్పీ సూర్యచంద్రరావు ఆదివారం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వీఐపీ ఎంట్రీ, పార్కింగ్, హెలిప్యాడ్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News November 23, 2025

RBIలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

image

<>ఆర్బీఐ <<>>5 మెడికల్ కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: rbi.org.in.

News November 23, 2025

వన్డేలకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన టీమ్ ఇండియా

image

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్‌కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.