News April 9, 2025
మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే మలేరియా తీవ్రమయ్యే అవకాశం ఉండవచ్చని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 23, 2025
3,800 దరఖాస్తులు పెండింగ్పై జేసీ రాహుల్రెడ్డి ఆగ్రహం

జిల్లాలో పెండింగ్లో ఉన్న జాయింట్ ఎల్పీఎం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి రీ-సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పీజీఆర్ఎస్ పిటిషన్ల పరిష్కారాలపై ఆయన గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇంకా 3,800 జాయింట్ ఎల్పీఎంలు పెండింగ్ ఉండటంపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
News October 23, 2025
మానవపాడు: ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.50 వేల ఫైన్

ఏపీ నుంచి తెలంగాణలోని గ్రామాలవైపు అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలు ఏవైనా పట్టుపడితే కేసులు, ఫైన్లు తప్పనిసరి వేస్తున్నామని తహశీల్దార్ జోషి శ్రీనివాస్ రావు అన్నారు. ఈ నెల 9న ఏపీలోని తాడిపత్రి నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై చంద్రకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. అట్టి వాహనాలకు ఒక్కొక్క వాహనంకు రూ.50 వేల ఫైన్ వేశామని, రెండోసారి వాహనం ఇసుకను రవాణా చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
News October 23, 2025
ఆమరణ దీక్షకు దిగుతా: షర్మిల

ఆంధ్ర రత్న భవనం వద్ద వైఎస్ షర్మిల వర్షంలో తడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.700 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సేవలు పునరుద్ధరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.