News April 9, 2025

మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే మలేరియా తీవ్రమయ్యే అవకాశం ఉండవచ్చని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 24, 2025

ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.

News November 24, 2025

నెమ్లి: రెజ్లింగ్‌లో నేషనల్ లెవెల్‌కి ఎంపిక

image

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల నెమ్లికి చెందిన నిహారిక అనే విద్యార్థిని రెజ్లింగ్ విభాగంలో నేషనల్ లెవెల్‌కి ఎంపికైనట్టు స్కూల్ హెడ్ మాస్టర్ బాలరాజు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో స్టేట్ లెవెల్‌లో గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ తీసుకున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ నిహారికను సన్మానించి నేషనల్ లెవెల్‌లో కూడా గెలవాలని అభినందించారు.

News November 24, 2025

పెద్దపల్లి: ‘కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి’

image

కార్మిక సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సుల పోస్టర్ అదనపు కలెక్టర్ దాసరి వేణు కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో నిర్మాణ కార్మికులు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు కార్మిక సంక్షేమంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుల కోసం పెద్దపల్లి 9492555258, మంథని 9492555248, గోదావరిఖని 9492555284 కార్మిక అధికారులను సంప్రదించాలని సూచించారు.