News April 9, 2025

మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే మలేరియా తీవ్రమయ్యే అవకాశం ఉండవచ్చని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 18, 2025

వాట్సాప్‌లో మీసేవ సర్వీసులు ప్రారంభం

image

TG: మీసేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రజలు మీసేవలో పొందే మొత్తం 580 సేవలను వాట్సాప్‌లోనే పొందచ్చు. ప్రజలు ఇంటి నుంచే విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి కూడా ఇంటి నుంచే పొందే వీలుంటుంది. ఇవన్నీ క్రమంగా వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.

News November 18, 2025

వాట్సాప్‌లో మీసేవ సర్వీసులు ప్రారంభం

image

TG: మీసేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రజలు మీసేవలో పొందే మొత్తం 580 సేవలను వాట్సాప్‌లోనే పొందచ్చు. ప్రజలు ఇంటి నుంచే విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి కూడా ఇంటి నుంచే పొందే వీలుంటుంది. ఇవన్నీ క్రమంగా వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.

News November 18, 2025

కామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం శాబ్దీనగర్ గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పనుల పురోగతిని పరిశీలించి లబ్ధిదారురాలు చింతల సుమలత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల తీరు, బ్యాంక్ రుణం, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇసుక సరఫరా వంటి అంశాలపై లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.