News April 1, 2024

మల్కాజిగిరిలో తెరపైకి లోకల్- నాన్ లోకల్ ఇష్యూ

image

మల్కాజిగిరి MP సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు BRS గెలుపొందలేదు. తెలంగాణ ఉద్యమ వేడి ఉన్న రోజుల్లోనూ, KCR హవా నడుస్తున్న సమయంలోనూ ఇక్కడ TDP, కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని గులాబీ పార్టీ శ్రమిస్తోంది. ఈ దశలోనే BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ క్యాండిడేట్ అని.. సునీతామహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఈటల రాజేందర్ (BJP) నాన్ – లోకల్ అని BRS శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

Similar News

News April 20, 2025

HYDలో 2 దశాబ్దాల తర్వాత పోరు!

image

HYD స్థానిక కోటా MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత 22 ఏళ్లుగా ఈ స్థానం ఏకగ్రీవమే. ఈ సారి పోటీకి BJP సిద్ధమవడం విశేషం. ఈ కోటాలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. INC ఎన్నికకు దూరం ఉండగా.. BRS ఏకంగా పోలింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 23న MIMతో BJP పోటీ పడుతోంది.

News April 20, 2025

HYD: రెసోనెన్స్ విద్యార్థుల జయకేతనం

image

JEE మెయిన్స్-2025 ఫలితాలలో రెసోనెన్స్ విద్యార్థులు సత్తా చాటారు. మెయిన్స్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. అర్చిస్మాన్ అనే స్టూడెంట్ 295 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది.

News April 20, 2025

HYD: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం

image

హైదరాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 16,305 మంది విద్యార్థులు 73 కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీసులను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

error: Content is protected !!