News May 4, 2024

మల్కాజిగిరిలో పురుషుల ఓట్లే కీలకం!

image

దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అభ్యర్థుల గెలుపోటములకు పురుషుల ఓట్లే కీలకం కానున్నాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,45,624 కాగా.. మహిళా ఓటర్లు 18,33,430 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మహిళా ఓట్ల కంటే పురుషుల ఓట్లు 1,12,194 అధికంగా ఉన్నాయి.

Similar News

News December 6, 2025

HYD: HMDA వేలంపాట్లతో రూ.3,862.8 కోట్ల ఆదాయం!

image

​హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) తన చారిత్రక భూ వేలంపాట్ల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది. ఇటీవల 1.98 ఎకరాల గోల్డెన్‌మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు పొందింది. ఈ ఫలితంతో, వేలంపాట్ల ద్వారా HMDA మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లకు చేరింది.

News December 6, 2025

HYD: HMDA వేలంపాట్లతో రూ.3,862.8 కోట్ల ఆదాయం!

image

​హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) తన చారిత్రక భూ వేలంపాట్ల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది. ఇటీవల 1.98 ఎకరాల గోల్డెన్‌మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు పొందింది. ఈ ఫలితంతో, వేలంపాట్ల ద్వారా HMDA మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లకు చేరింది.

News December 6, 2025

అరుణాచల ప్రదక్షిణకు HYD నుంచి ప్రత్యేక బస్సులు

image

అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం HYD–2 డిపో DSNR నుంచి ప్రత్యేక బస్సులను RTC అందుబాటులోకి తెచ్చింది. బస్సులు DEC 12న రాత్రి 7 గంటలకు బయలుదేరి, కాణిపాకం–గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుతాయి. తిరుగు ప్రయాణం 14న మ.3గంటలకు ప్రారంభమై ఉ.8గంటలకు HYD చేరుకోనుందని HYD-2 డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. ఒక్క టికెట్ ధర రూ.3,900 మరిన్ని వివరాలకు 9959444165 నంబర్లకు సంప్రదించాలన్నారు.