News March 21, 2024
మల్కాజిగిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలి: సునీతారెడ్డి
మల్కాజిగిరి సిట్టింగ్ పార్లమెంట్లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలని జడ్పీ ఛైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఈరోజు ఇన్ఛార్జులు, ముఖ్య నాయకులకు సూచించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Similar News
News September 29, 2024
సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్
సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ రక్షణ చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ కవచ్ యంత్రాలు దాదాపు 28 స్టేషన్లో ఏర్పాటు చేశారు.
News September 29, 2024
HYD: సబ్సిడీ రాలేదా..? వెంటనే కాల్ చేయండి!
HYD, RR, MDCL, VKB మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సబ్సిడీ సంబంధించిన పత్రాలు ఇప్పటికే చాలా మందికి జారీ అవ్వగా.. సబ్సిడీ లబ్ధి కూడా పలువురికి అందుతుంది. అయితే సిలిండర్ డెలివరీ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాల్లో 4 రోజుల్లో జమకాకుంటే వెంటనే 1967, 1800-4250-0333 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
News September 29, 2024
HYD: పోలీసన్నకు ఎంతటి కష్టం..
ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడే పోలీసన్న పరిస్థితి చూసి పలువురు కంటతడి పెట్టారు. పోలీసుల వివరాలు.. యూసుఫ్గూడ 1వ బెటాలియన్లో పోలీసు అధికారి జనార్ధన్ శ్వాస సమస్యతో ఓ హాస్పిటల్కు వెళ్లారు. ఆరోగ్య భద్రత కార్డు ఉన్నా.. యాజమాన్యం చికిత్సకు అంగీకరించలేదు. అక్కడి నుంచి మరో హాస్పిట్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. హెల్త్ కార్డ్ ఉన్నా తమకు తగిన గుర్తింపులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.