News February 20, 2025

మల్కాజిగిరి: 63 కిలోల ఎండు గంజాయి పట్టివేత

image

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి, ఆలేరు, మహబూబాబాద్, కాజీపేట ప్రాంతంలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 63 కిలోల గంజాయి పట్టుబడినట్లు రైల్వే బృందం తెలిపింది. దీని విలువ దాదాపుగా రూ.20.25లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. గత 3రోజులుగా రైళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న అధికారులు, గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నారు.  

Similar News

News December 16, 2025

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

image

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.

News December 16, 2025

నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

image

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.

News December 16, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం

image

పెదవేగి జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (DPTC) నుండి కానిస్టేబుల్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం 10 ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూర్య చందర్రావు పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా నుండి సివిల్ కానిస్టేబుళ్లుగా 30 మంది, ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లుగా 116 మంది, మొత్తం 146 మంది పురుషులు, మహిళలు ఎంపికయ్యారు.