News February 20, 2025
మల్కాజిగిరి: 63 కిలోల ఎండు గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి, ఆలేరు, మహబూబాబాద్, కాజీపేట ప్రాంతంలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 63 కిలోల గంజాయి పట్టుబడినట్లు రైల్వే బృందం తెలిపింది. దీని విలువ దాదాపుగా రూ.20.25లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. గత 3రోజులుగా రైళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న అధికారులు, గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నారు.
Similar News
News November 26, 2025
అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య

TG: అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం. కానీ మెదక్(D) వెల్దుర్తిలో అల్లుడు సూసైడ్ చేసుకున్నాడు. HYD జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్(32)కు 2022లో పూజతో వివాహమైంది. అప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని అత్తమామలు వేధిస్తున్నారు. ఈనెల 2న పెద్దల పంచాయితీలోనూ దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఈనెల 18న పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామలపై కేసు నమోదైంది.
News November 26, 2025
ఏలూరు జిల్లాలో మార్పుల్లేవ్

రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ఏర్పడే కొత్త జిల్లా వల్ల ఏలూరు జిల్లాలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోవడం లేదు. పోలవరం పేరుతో మాత్రమే జిల్లా అని, అందులో పోలవరం నియోజకవర్గం ఉండటం లేదని తేలింది. ఏలూరు జిల్లాలోని మన్యం ప్రాంతం అంతా కలిపి పోలవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోరుతూ ఆదివాసీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలో ఆ ఊసు లేకపోవడంతో కొంత నిరాశ చెందారు.
News November 26, 2025
పీరియడ్స్లో బ్లాక్ బ్లెడ్ వస్తోందా?

పీరియడ్స్లో కొందరిలో డార్క్ / బ్లాక్ బ్లడ్ డిశ్ఛార్జ్ కనబడుతుంది. అయితే దీనికి కారణం ఆహారం, జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులే అని నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భాశయం నుంచి వచ్చే పాత రక్తం కావొచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్, టాంపోన్స్, కాపర్ టీ వల్ల కూడా ఇలా కనిపిస్తుంది. ఏదేమైనా పీరియడ్ బ్లడ్లో ఏదైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


