News March 31, 2025
మల్కాజ్గిరి: ‘పిచ్చుకలు రక్షించాలంటూ సెలబ్రేషన్స్’

రోజురోజుకు పిచ్చుకల చప్పుడు కనుమరుగైపోతుంది. దీనిని గుర్తించిన మల్కాజిగిరి స్పారో బృందం, దావూదీ భరోసా కేంద్రం సభ్యులందరూ కలిసి ప్రత్యేక సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ గ్రామాలకు వెళ్లి సైతం అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు డా.సువర్ణ ప్రకాష్ సింగ్ తెలిపారు. పర్యావరణంపై ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా జీవరాశుల పట్ల వ్యవహరించాలని కోరారు.
Similar News
News October 14, 2025
SRP: డిప్యూటేషన్ పై పనిచేసేందుకు దరఖాస్తులు

టీజీ జెన్కోలోని తాడిచెర్ల- 1 బొగ్గుగనిలో ఒక ఏడాది పాటు డిప్యూటేషన్ పై పనిచేసేందుకు ఎగ్జిక్యూటివ్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల జీఎంలకు సర్క్యులర్ జారీ చేసింది. మైనింగ్, పర్సనల్, సర్వే విభాగాలు, ఓవర్ మెన్ హోదా నుంచి ఈ/4, ఈ/5 గ్రేడ్లలో ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 17 లోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది.
News October 14, 2025
మంచిర్యాల: జాతీయ రహదారి విస్తరణ వేగవంతం చేయాలి

జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారి ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆర్డీవో శ్రీనివాస్తో కలిసి జాతీయ రహదారి విస్తరణలో ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
News October 14, 2025
డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.