News March 31, 2025

మల్కాజ్గిరి: ‘పిచ్చుకలు రక్షించాలంటూ సెలబ్రేషన్స్’

image

రోజురోజుకు పిచ్చుకల చప్పుడు కనుమరుగైపోతుంది. దీనిని గుర్తించిన మల్కాజిగిరి స్పారో బృందం, దావూదీ భరోసా కేంద్రం సభ్యులందరూ కలిసి ప్రత్యేక సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ గ్రామాలకు వెళ్లి సైతం అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు డా.సువర్ణ ప్రకాష్ సింగ్ తెలిపారు. పర్యావరణంపై ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా జీవరాశుల పట్ల వ్యవహరించాలని కోరారు.

Similar News

News November 7, 2025

ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

image

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.

News November 7, 2025

HYD సైబర్ క్రైమ్ దుమ్మురేపే ఆపరేషన్

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ ఆపరేషన్‌లో భారీ దందాలు ఛేదించారు. మొత్తం 196 కేసులు, 55 అరెస్టులు, ₹62 లక్షల రిఫండ్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ & ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాల్లో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి నిందితులు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మరిన్ని కేసుల్లో రూ.లక్షల్లో రిఫండ్ చేశారు.

News November 7, 2025

రామగుండంలో PM అప్రెంటిషిప్ మేళా

image

RGM ప్రభుత్వ ఐటీఐలో NOV 10న ఉదయం 10 గంటలకు “ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా” నిర్వహించబడుతుంది. ఈ మేళాలో ఎల్‌&టి, వరుణ్ మోటార్స్, స్నైడర్ ఎలక్ట్రికల్స్, తోషిబా, ఉషా ఇంటర్నేషనల్, కేశోరాం సిమెంటు వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటీఐ ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. అప్రెంటిషిప్ చేయదలచిన అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన పత్రాలతో హాజరు కావాలని సూచించారు.