News April 15, 2025
మల్కాపురం: బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

మల్కాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మల్కాపురంలో అంగ కృష్ణ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని బాలికతో అసభ్యకరంగా ప్రవరించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
Similar News
News October 13, 2025
జీవీఎంసీలో పీజీఆర్ఎస్కు 100 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 100 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ అదనపు కమిషనరు డి.వి.రమణమూర్తి తీసుకున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్ విభాగమునకు 4, రెవెన్యూ 5, ప్రజారోగ్యం 6, పట్టణ ప్రణాళిక 58, ఇంజినీరింగు 22, మొక్కల విభాగం 1, యుసిడి 04 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News October 13, 2025
విశాఖలో పీజీఆర్ఎస్కు 271 వినతులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 271 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 82 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీ సంబంధించి 86 ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 88 వినతులు ఉన్నాయి.
News October 13, 2025
రేషన్ బియ్యం అక్రమాలకు చెక్: మంత్రి నాదెండ్ల

రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటివరకూ 5.65 లక్షల క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని, 230 క్రిమినల్ కేసులు పెట్టామని తెలిపారు. విశాఖలో మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. స్పాట్లోనే రేషన్ బియ్యం గుర్తించేందుకు మొబైల్ కిట్స్ ఉపయోగిస్తున్నామని, ఎరుపు రంగులోకి మారితే రేషన్ బియంగా గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు.