News January 22, 2025
మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పోకడలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో పాటు పిరమిడ్ లాంటి స్కీంల ద్వారా ప్రజల సొమ్ము దోచేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News February 15, 2025
వరంగల్: ఎన్నికలకు రెడీ.. వాయిదాపై అధికారుల నిట్టూర్పు!

మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా సిద్ధం చేశారు.
News February 15, 2025
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై నజర్ పెట్టండి: సీపీ

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నజర్ పెట్టాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేసేవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా మందుబాబులు తాగి వాహనాలు నడపకుండా ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు.
News February 15, 2025
వరంగల్: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

తెలియక ఓ చెట్టు పండ్లను తిన్న గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.HNK జిల్లా హసన్పర్తి జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో శుక్రవారం పలువురు విద్యార్థులు ఇదే గురుకులంలోని ఒక చెట్టు పండ్లను తిన్నారు. దీంతో ఆరుగురు విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.