News March 28, 2025
మల్దకల్లో గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు..!

వర్షాల వల్ల గద్వాల జిల్లాలో వాతావరణంలో కాస్తా చల్లదనం ఉన్న ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత మరింతగా పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం మల్దకల్లో గరిష్ఠంగా 40.9, కోదండాపూర్, వెంకటాపూర్, అలంపూర్, రాజోలిలో గరిష్ఠంగా 40.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News December 6, 2025
సిద్దిపేట: అథ్లెటిక్స్లో సత్తాచాటిన శ్రీదేవి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట డిగ్రీ కళాశాల విద్యార్థిని అసాధారణ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని ఏ. శ్రీదేవి ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్స్ హర్డిల్స్లో సత్తాచాటింది. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ జి. సునీత ప్రత్యేకంగా అభినందించారు.
News December 6, 2025
హోంగార్డుల సేవలు అనిర్విచనీయం: కాకినాడ ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణతోపాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో వారు పోలీసు శాఖకు వెన్నెముకలా నిలబడి ఉత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
News December 6, 2025
కార్డియాలజిస్టుల నియామకానికి కృషి: మంత్రి సుభాష్

కాకినాడ GGHలో కార్డియాలజీ విభాగంలో వైద్యుల నియామకం చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శనివారం ఆయన GGHను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు వార్డులను పరిశీలించారు. కార్డియాలజిస్టులు లేని విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.


