News March 12, 2025

మల్దకల్లో 37 9°c ఉష్ణోగ్రతలు నమోదు

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. రేపటి నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలో అత్యధికంగా 37 9°c, గద్వాల్లో 37.3°c, అలంపూర్‌లో 37.1°c, సాతర్లలో 36.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 14, 2025

హనుమకొండ: ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ 

image

హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ పి.ప్రావిణ్య జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు. 

News March 14, 2025

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు: హ‌రీశ్‌రావు

image

రాష్ట్ర అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఈరోజు ఒక చీక‌టి రోజు అని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేసిన అనంత‌రం నెక్లెస్ రోడ్డులోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ను ప్రతిపాదించినప్పుడు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు.

News March 14, 2025

హోళీ పండుగపై కడప ఎస్పీ సూచనలు

image

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హోళీ పండుగ శుభాకాంక్షలతో పాటు పలు సూచనలు చేశారు. హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలన్నారు. అన్ని మతాలవారు మతసామరస్యం పాటిస్తూ ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ బాధ్యతతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా హద్దులు దాటితే ఉపేక్షించమని, ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.

error: Content is protected !!