News December 13, 2024

మల్యాల: వ్యక్తి సజీవ దహనం.. UPDATE

image

షార్ట్ సర్క్యూట్‌తో నిన్న మల్యాల మండలంలో వ్యక్తి <<14855286>>సజీవ <<>>దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మ్యాడంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి(40) ట్రాక్టర్ డ్రైవర్‌, భార్య సౌందర్య హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే తిరుపతి మంటలకు ఆహుతి అయ్యాడు.

Similar News

News December 1, 2025

KNR: ‘హెచ్‌ఐవీ తగ్గుముఖం.. ‘జీరో’ లక్ష్యంగా కృషి’

image

దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతుందని ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను ‘జీరో’కు తీసుకురావడమే ధ్యేయమన్నారు. వ్యాధిగ్రస్తులు ధైర్యంగా మందులు వాడాలని సూచించారు. అనంతరం ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

News December 1, 2025

‘TCC పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

image

TG ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ TCC(టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా DEC 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఆర్ట్ వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షులు తాడూరి లక్ష్మీనారాయణ సూచించారు. పూర్తి వివరాలకు www.bsetelangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన కోరారు.

News November 30, 2025

కరీంనగర్: 113 గ్రామాలకు 121 నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి రోజు 113 గ్రామాలకు121 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చిగురు మామిడి మండలంలో 16, గన్నేరువరం మండలంలో 10, మానకొండూర్ మండలంలో 30, శంకరపట్నం మండలంలో 35, తిమ్మాపూర్ మండలంలో 30 గ్రామ సర్పంచికి నామినేషన్లు దాఖలు అయ్యాయి.113 గ్రామాలలో 1046 వార్డు లు ఉండగా, మొదటి రోజు 209 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.