News January 24, 2025

మల్లంపల్లి మండలాన్ని ప్రారంభించిన మంత్రులు

image

ములుగు జిల్లాలో నూతన మల్లంపల్లి మండలాన్ని రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి మల్లంపల్లి మండల ఏర్పాటు కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు అశోక్, గ్రంథాలయ ఛైర్మన్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 22, 2025

అద్దం పగిలితే అపశకునమా?

image

ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం ఏడేళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కానీ ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలని ఈ టాక్టిక్‌ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి, అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని పండితులు చెబుతున్నారు.

News November 22, 2025

మంగేళ గ్రామంలో ఎస్సీలకు దక్కని రాజ్యాంగ ఫలం

image

ఎస్సీ జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎస్సీ కులస్థులకు మాత్రం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రాజకీయ రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. బీర్పూర్ (M) మంగేళ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 238గా ఉంది. ప్రస్తుతం సుమారు 350 వరకు ఉంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో ఎస్సీ కులస్థులు వెనుకబడి పోతున్నారు. ఇప్పుడైనా ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరుతున్నారు.