News February 28, 2025
మల్లన్నకు ఇరుముడి సమర్పించిన కార్మిక శాఖ మంత్రి

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శివమాల ధరించిన ఆయన ఈ సందర్భంగా స్వామివారికి ఇరుముడి సమర్పించారు. ఆలయగా రాజగోపురం వద్ద అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావు, అధికారులు, అర్చక స్వాములు ఉన్నారు.
Similar News
News December 2, 2025
NGKL: రెండో రోజు దాఖలైన నామినేషన్ వివరాలు!

NGKL జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు మొత్తం 280 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దకొత్తపల్లిలో అత్యధికంగా 72 నామినేషన్లు వచ్చాయి. కొల్లాపూర్ (39), కోడేరు (37), నాగర్కర్నూల్ (45), తిమ్మాజీపేట (48), బిజినపల్లి (22), పెంట్లవెల్లి (17) నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 151 గ్రామాలకు గాను 458 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
News December 2, 2025
PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారు.
News December 2, 2025
విశాఖ: ‘మా కొడుకును కోడలే చంపింది’

విశాఖలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే కోడలే తమ కొడుకుని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిశోర్ తల్లి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


