News February 28, 2025

మల్లన్నకు ఇరుముడి సమర్పించిన కార్మిక శాఖ మంత్రి

image

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శివమాల ధరించిన ఆయన ఈ సందర్భంగా స్వామివారికి ఇరుముడి సమర్పించారు. ఆలయగా రాజగోపురం వద్ద అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావు, అధికారులు, అర్చక స్వాములు ఉన్నారు.

Similar News

News January 9, 2026

నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతుల పచ్చజెండా

image

నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతులు పూర్తిస్థాయిలో అంగీకారం తెలిపారు. దౌల్తాబాద్ సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు వివిధ మండలాల రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు. సుమారు రూ.4,885 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 32 గ్రామాల్లోని 23,758 ఎకరాలకు సాగునీరు అందనుంది.

News January 9, 2026

మూసీ ప్రాజెక్ట్‌కు 200 ఎకరాల అదనపు సేకరణ

image

​మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లోని సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్‌ను, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని ఓ అధికారులు Way2News కు తెలిపారు.

News January 9, 2026

మేడారంలో ప్రకృతే దైవం..! అందుకే ఇంతటి ప్రాశస్థ్యం..!!

image

గిరిజన గూడెంలో జరిగే మేడారం జాతర కోట్ల మందికి విశ్వాసంగా మారడానికి కారణం ఇక్కడి స్వచ్ఛమైన, కల్మషం లేని ఆదివాసుల సంస్కృతి. తమకు జీవనాధారం అయిన ప్రకృతిని దైవంగా ఆరాధించడమే. ఇలవేల్పులు సమ్మక్క- సారలమ్మలను కుంకుమ బరిణ రూపంలో చూసుకోవడం. ఆకలి తీర్చే చెట్టు, దాహం తీర్చే వాగు, సాయం చేసే పశువులు, స్నేహం చేసే పక్షులను దేవుళ్లుగా భావిస్తారు. అందుకే జాతర రెండేళ్లకోసారి జరిగినా వనమంతా జన గుడారం అవుతుంది.