News February 28, 2025

మల్లన్నకు ఇరుముడి సమర్పించిన కార్మిక శాఖ మంత్రి

image

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శివమాల ధరించిన ఆయన ఈ సందర్భంగా స్వామివారికి ఇరుముడి సమర్పించారు. ఆలయగా రాజగోపురం వద్ద అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావు, అధికారులు, అర్చక స్వాములు ఉన్నారు.

Similar News

News March 21, 2025

ఉస్మానియా యూనివర్సిటీ బీసీఏ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల మూడవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News March 21, 2025

వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఎం ఫార్మసీ (పీసీఐ) మొదటి, రెండు, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News March 21, 2025

డ్రగ్స్ నియంత్రణకు కార్యచరణ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేస్తూ, నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.

error: Content is protected !!