News April 24, 2024

మల్లన్నను దర్శించుకున్న నారా చంద్రబాబు దంపతులు

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా సోమవారం శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News December 8, 2025

కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు

image

కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు వచ్చాయని వాటిని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 119 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా విని సంబంధిత పోలీసులను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.

News December 8, 2025

కర్నూలు: హలో యువత మేలుకో పోస్టర్ విడుదల

image

కర్నూలు జిల్లాలో యువతలో మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అయ్యప్ప రాష్ట్ర సమితి ముద్రించిన “హలో యువత మేలుకో-చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో” నినాదంతో వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, చాంద్ బాషా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంటి, దస్తగిరి పాల్గొన్నారు.

News December 8, 2025

నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: ఎస్పీ

image

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్‌వర్డ్, సీవీవీ ఫోన్‌లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్‌గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దు అన్నారు.