News February 22, 2025

మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

image

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.

Similar News

News November 23, 2025

కొత్తగూడెం: దుప్పి మాంసం కేసు.. రిమాండ్

image

అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దుప్పిని వేటాడి మాంసం విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులకు కొత్తగూడెం జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ శనివారం 14 రోజుల రిమాండ్ విధించారు. మిట్టగూడేనికి చెందిన సప్కా వీరస్వామి, కనితి కన్నయ్యలను శుక్రవారం రాత్రి దుప్పి మాంసంతో సహా అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జిల్లా కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 23, 2025

ములుగు: నేడు సర్పంచ్ రిజర్వేషన్ జాబితా విడుదల..!

image

సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 10 మండలాల్లోని 146 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను అధికారులు నిర్ణయించారు. అనంతరం నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. నేడు తుది జాబితాను కలెక్టర్ అధికారికంగా విడుదల చేయనున్నారు. అనంతరం ఇదే జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

News November 23, 2025

GVMCలో అవినీతి ‘ప్లానింగ్’..!(1/1)

image

నిర్మాణ రంగం ఊపందుకుంటున్న విశాఖలోని GVMC <<18365028>>టౌన్ ప్లానింగ్<<>> విభాగంపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని అన్ని జోన్లలో దాదాపు పరిస్థితి ఒకేలా ఉంది. అనుమతులు, కంపౌండ్ వాళ్లు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు.. ఏ పనైనా “ధనం ఉంటే వెంటనే-లేకపోతే నెలల తరబడి లేటు” అన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, నిబంధనలు పట్టించుకోకుండానే కొన్ని భవనాలకు అనుమతులు ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.