News February 22, 2025
మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.
Similar News
News December 1, 2025
అంకన్నగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం..!

ములుగు మండలంలోని ఆదర్శ గ్రామ పంచాయతీ అంకన్నగూడెం పాలకవర్గం ఏకగ్రీవమైంది. ఈ గ్రామానికి రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కేటాయించగా.. సర్పంచ్గా కొట్టెం రాజు, ఉప సర్పంచ్గా అల్లెం నాగయ్యను ఎన్నుకుంటూ గ్రామస్థులు తీర్మానించారు. ఆరుగురు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. <<18420628>>1972లో పంచాయతీ ఆవిర్భావం నుంచి ఏకగ్రీవం <<>>చేసుకుంటున్న గ్రామస్థులు అదే ఆనవాయితీని కొనసాగించారు. మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారు.
News December 1, 2025
పెళ్లి చేసుకున్న సమంత!

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వెల్లడించాయి. ఈ కపుల్కు పలువురు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించి ఈ జోడీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News December 1, 2025
గుంటూరులో 2,56,904 మందికి రూ.111.34కోట్ల పంపిణీ

జిల్లాలో ప్రతి నెల 2,56,904 మందికి లబ్దిదారులకు రూ.111.34కోట్ల పంపిణీ జరుగుతోంది. వీరిలో వృద్ధాప్యపు పింఛన్లు 1,18,174, వితంతు 70,112, చేనేత 3,862, గీతకార్మికులు 443, మత్స్యకారులు 570, ఒంటరి మహిళలు 11,330, చర్మకారులు 876, హిజ్రాలు 67, HIV బాధితులు 2,614, కళాకారులు 77, డప్పు కళాకారులు 854, దివ్యాంగులు 24,835, వైద్య సంబంధిత 1667, సైనిక సంక్షేమం 28, అభయహస్తం 3,994, అమరావతి భూముల సంబంధిత 17,401మంది.


