News February 22, 2025

మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

image

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.

Similar News

News October 17, 2025

VZM: ఏమ్మా.. దేని కోసం వచ్చారు..!

image

కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌ను శుక్రవారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్.కోట మండలం రూపశ్రీ అనే దివ్యాంగురాలు మూడు చక్రాల సైకిల్‌తో సమస్య చెప్పుకునేందుకు తండ్రితో వచ్చింది. అటుగా వచ్చిన కలెక్టర్ ఆమెను చూసి ఏమ్మా.. దేనికోసం వచ్చారని పలకరించారు. SGTగా ఎంపిక కాగా.. పోస్టింగ్ కురుపాం మండలం ఇచ్చారని, పూర్తిగా వికలాంగురాలైన ఆమె తన సమస్యను వివరించగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

News October 17, 2025

సత్‌ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్లు ఎత్తివేస్తాం: ములుగు ఎస్పీ

image

సత్‌ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్లు ఎత్తివేస్తామని ఎస్పీ శబరిష్ తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోని రౌడీ, సస్పెక్ట్ షీటర్లకు ప్రతినెల కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఏడాది కాలంలో సత్‌ప్రవర్తన ఉన్న 73 మందిపై షీట్లు ఎత్తివేశామన్నారు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలు, నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తగా రౌడీషీటర్లపై నిఘా పెట్టామని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.

News October 17, 2025

RCBని అమ్మేయాలని ప్రయత్నాలు?

image

IPL: RCBని $2 బిలియన్లకు అమ్మేందుకు పేరెంట్ కంపెనీ Diageo ప్రయత్నాలు చేస్తోందని Cricbuzz తెలిపింది. IPLలో లిక్కర్ బ్రాండ్ల యాడ్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన రూల్స్ తేవడంతో లాభదాయకం కాదని భావిస్తున్నట్లు సమాచారం. అధార్ పూనావాలా (సీరమ్ ఇన్‌స్టిట్యూట్), పార్థ్ జిందాల్ (JSW గ్రూప్), అదానీ గ్రూప్, ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ, మరో రెండు అమెరికా ప్రైవేట్ సంస్థలు ఆర్సీబీని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట.