News February 22, 2025

మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

image

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.

Similar News

News March 22, 2025

విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

image

AP: విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్‌కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.

News March 22, 2025

BHPL: అటవీ భూముల కేటాయింపుపై సమీక్ష

image

 చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్‌‌బీ, మెగా ప్రాజెక్టు అధికారులకు అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News March 22, 2025

25 ఏళ్ల వరకూ డీలిమిటేషన్ ఉండొద్దు: స్టాలిన్

image

తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో డీలిమిటేషన్‌పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అనంతరం స్టాలిన్ మాట్లాడారు. ‘25 ఏళ్ల వరకూ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానించాం. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో రెండో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కొన్ని కారణాల వల్ల TMC హాజరు కాలేదు. జగన్ కూడా మా వెంటే ఉన్నట్లు భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!