News February 25, 2025
మల్లాపూర్: పచ్చదనం నింపుకున్న చెట్టు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలోని ఒక చెట్టు నిండుగా ఆకుపచ్చ ఆకులతో మనసుని ఆకట్టుకుంటుంది. కొత్తగా ఆకులు చిగురించడంతో చెట్టు మొత్తం పచ్చని ఆకులతో వత్తుగా పెరగడంతో, పచ్చదనంతో చూడగానే మనసుని ఆకర్షించేలా కనిపిస్తుంది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకి మంగళవారం చిక్కింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
Similar News
News February 26, 2025
జనగామ: పోలీస్ ఎస్కార్ట్తో పరీక్ష పేపర్లను తరలించాలి: కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ బషా షేక్ 10వ తరగతి పరీక్షలపై సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలని అధికారులకు సూచించారు.
News February 26, 2025
మహబూబాబాద్: అధికారులతో కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉ.8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రభుత్వ, ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు పక్కాగా అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.
News February 26, 2025
సంగారెడ్డి: విద్యుత్ కాంతుల్లో కాశీ విశ్వేశ్వర ఆలయం

కాకతీయుల కాలంలో నిర్మించిన సంగారెడ్డి మండలం కల్పగురు గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 26వ తేదీన ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.