News November 9, 2024

మళ్లీ చిలకలూరిపేటకు విడదల రజిని

image

మాజీ మంత్రి విడదల రజినికి YCP అధిష్ఠానం మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచి మంత్రి అయిన ఆమె.. తాజా ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌లో ఓడిపోయారు. అటు చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు ఓటమి చెందారు. పల్నాడులో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించిన జగన్.. విడదల రజినిని తిరిగి యథాస్థానానికి పంపారు. వైసీపీ అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంపై మీ కామెంట్.

Similar News

News December 4, 2025

GNT: మారువేషంలో మార్చూరీని పరిశీలించిన సూపరింటెండెంట్.!

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి మరోసారి మారువేషంలో ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. ఈసారి ఆయన టీషర్ట్, మడత వేసిన ప్యాంటు, మాస్క్, మంకీ క్యాప్ ధరించి మార్చూరీ బయట సాధారణ వ్యక్తిలా ఒక గంటపాటు కూర్చున్నారు. అక్కడే ఉండి, మృతదేహాల బంధువులతో మాట్లాడి, మార్చూరీలోని పరిస్థితులను అధ్యయనం చేశారు.

News December 4, 2025

దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

image

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.

News December 4, 2025

నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

image

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.