News June 27, 2024

మస్కట్‌లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

image

నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు మస్కట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము(42) మూడు నెలల క్రితం మస్కట్‌కు వెళ్లాడు. అక్కడ బుధవారం రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

Similar News

News November 18, 2025

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

image

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

News November 18, 2025

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

image

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

News November 17, 2025

నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.