News March 27, 2024

మహబూబాబాద్‌లో రసవత్తరంగా MP పోరు

image

మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో లోక్ సభ పోరు రసవత్తరంగా మారింది. 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు ఇప్పటికే సమావేశాలు, కార్యాచరణలు రూపొందించుకుంటున్నారు. BRS నుంచి మాలోతు కవిత, BJP నుంచి సీతారాంనాయక్, కాంగ్రెస్ నుంచి బలరాంనాయక్‌లు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బరిలో నిలవనున్న ముగ్గురికి గతంలో ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పోరు ఆసక్తిగా మారింది.

Similar News

News October 6, 2024

GREAT.. జనగామ: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఒకే ఇంట్లో అన్నా చెల్లెలు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్య కొడుకు మహేశ్ కుమార్, కూతురు మౌనికలు ఇటీవల విడుదలైన డీఎస్సీ(SGT) ఫలితాల్లో వరుసగా 5, 15వ ర్యాంక్‌లు సాధించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి బీడీలు చేసి వీరిని చదివించింది.

News October 6, 2024

మహాలక్ష్మి అలంకరణలో భద్రకాళి అమ్మవారు

image

ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో ఆలయ అర్చకులు అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.

News October 6, 2024

ఉగాండాలో జనగామ జిల్లా వాసి దారుణ హత్య

image

జనగామ జిల్లా వాసిని ఉగాండాలో హత్య చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పట్టణానికి చెందిన తిరుమలేశ్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఉగాండాలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడే పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో తిరుమలేశ్‌పై కాల్పులు జరపడంతో ప్రాణాలు వదిలాడు. అనంతరం సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకొని మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.