News April 8, 2025
మహబూబాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు అందించే అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కులాల సంక్షేమాధికారి నరసింహస్వామి తెలిపారు. తెలంగాణకు చెందిన ఎస్సీ కుల విద్యార్థులు రూ.5 లక్షల ఆదాయం మించకుండా పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనవారు దీనికి అర్హులన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19 వరకు అవకాశం ఉందన్నారు.
Similar News
News November 21, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో చలి పంజా

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో అత్యల్పంగా 14.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి 14.2డిగ్రీలు, బిజినపల్లి, తెలకపల్లి 14.9, యంగంపల్లి 15.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News November 21, 2025
వంటగది చిట్కాలు

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.
News November 21, 2025
కాట్రేనికోన: కొబ్బరి చెట్టు పైనుంచి జారిపడి కార్మికుడి మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా దొంతికుర్రులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి కర్రీ అప్పలరాజు (36) అనే వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా గోపాలపట్నం వాసిగా గుర్తించారు. కాట్రేనికోన మండలంలో తోటి కూలీలతో కలిసి దింపులు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వచ్చిన కార్మికుడు మృతి చెందడంతో తోటి కూలీల్లో విషాదం అలముకుంది.


