News February 26, 2025
మహబూబాబాద్: అధికారులతో కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉ.8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రభుత్వ, ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు పక్కాగా అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 22, 2025
బూతుల్లేకుండా కథలు చెప్పలేరా?

ఇప్పుడొచ్చే సినిమాల్లో రక్తపాతం, రొమాన్సే కాదు బూతులు కూడా కామనైపోయాయి. చిన్నపిల్లలూ చిత్రాలు చూస్తారు, వింటారనే కామన్సెన్సును వదిలేసి తల్లులను అవమానించేలా ల** లాంటి పదాలను నిస్సిగ్గుగా వాడేస్తున్నారు. <<15640612>>ప్యారడైజ్<<>>, <<18643470>>రౌడీ జనార్ధన<<>> వంటి సినిమాలే నిదర్శనం. పైగా ‘కథ డిమాండ్ చేసింది’ అనే డైలాగులు రొటీనైపోయాయి. బూతుల్లేకుండా కథలు చెప్పలేరా? సెన్సార్ బోర్డులేం చేస్తున్నాయి? అనేవి బిలియన్ డాలర్ల ప్రశ్నలు.
News December 22, 2025
పోలీసు వృత్తి సేవా భావంతో కూడుకున్నది: SP

కాకినాడల్ APSP 3వ బెటాలియన్లో 2025-26 బ్యాచ్ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా SP బిందు మాధవ్ శిక్షణను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో చేరడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల సేవకు అంకితమయ్యే బాధ్యతాయుతమైన వృత్తి అని పేర్కొన్నారు.
News December 22, 2025
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట: ఆనం

ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పది రోజుల్లోని 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు (సుమారు 90 శాతం) వారికే కేటాయించారు. ఈ-డిప్లో టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయాల్లోనే తిరుమలకు రావాలని సూచించారు. AI టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, విస్తృత అన్నప్రసాదాలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.


