News February 25, 2025
మహబూబాబాద్: ఈనెల 27న ఉపాధ్యాయులకు సెలవు

ఈనెల 27న జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు.
Similar News
News March 19, 2025
పాలకుర్తి: అనారోగ్యం కారణంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ మారుతినగర్లో మంగళవారం ఆరే అజయ్(23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బసంతనగర్ ఎస్సై స్వామి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
News March 19, 2025
పలు పదవులకు SEC నోటిఫికేషన్

AP: మండల ప్రజా పరిషత్, 2 జిల్లా పరిషత్లు, పంచాయతీల్లో ఖాళీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రామ పంచాయతీల్లో 214 ఉప సర్పంచ్లు, వైఎస్సార్ ZP ఛైర్పర్సన్, కర్నూలు ZP కోఆప్టెడ్ మెంబర్, MPPలలో 28 ప్రెసిడెంట్స్, 23 వైస్ ప్రెసిడెంట్స్, 12 కోఆప్టెడ్ మెంబర్ ఖాళీలున్నాయి. ఈ నెల 23లోగా సంబంధిత మెంబర్లకు నోటీసులు జారీ చేస్తామని, 27న ఎన్నిక నిర్వహిస్తామని SEC తెలిపింది.
News March 19, 2025
KMR: ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలు సాధిస్తారు: కలెక్టర్

దివ్యాంగ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. సమగ్ర శిక్షా కామారెడ్డి జిల్లా, భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ శిబిరాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.