News March 8, 2025
మహబూబాబాద్: ఎస్ఐ సునందను సన్మానించిన అదనపు కలెక్టర్..

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో షి టీమ్ ఎస్ఐ సునంద పాల్గొని షీ టీమ్స్, మహిళల భద్రత, రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్,పై అవగాహన కల్పించారు. షి టీమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, మహిళలు ఏ విధమైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సునందను ఘనంగా శాలువాతో అధికారులు సన్మానించారు.
Similar News
News December 21, 2025
BRS ఆధ్వర్యంలో జల సాధన ఉద్యమం?

తెలంగాణ రాష్ట్రంలో మరో జల సాధన ఉద్యమం తప్పదని మాజీ సీఎం KCR భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని BRS ఆరోపిస్తోంది. ఇవాళ్టి పార్టీ కార్యవర్గ సమావేశంలో వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు దీనిపై దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.
News December 21, 2025
నంద్యాల: ‘ఇలా చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది’

నేషనల్ కన్జ్యూమర్స్ డే వారోత్సవాల్లో భాగంగా నంద్యాలలోని పలు హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అవగాహన కల్పించారు. హోటల్స్లో ఎక్కువగా కలర్స్ వాడుతున్నారని, వాటిని వాడితే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడతారని తెలిపారు. నాణ్యమైన, ప్రామాణికత గల వస్తువులనే వినియోగించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులు రవిబాబు, వెంకటరమణ, ఖదిమ్ వలి, అమిర్ బాషా పాల్గొన్నారు.
News December 21, 2025
మరిగించిన టీ.. 20 నిమిషాల తర్వాత తాగుతున్నారా?

టీ కాచిన 20 నిమిషాల తర్వాత తాగడం మంచిది కాదని హెల్త్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. రూమ్ టెంపరేచర్లో ఆక్సిడేషన్ జరిగి బ్యాక్టీరియా ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. రెండోసారి కాచిన టీ తాగితే జీర్ణాశయ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు. 24 గంటల తర్వాత టీని జపాన్లో పాము కాటు కంటే ప్రమాదకరమైనదిగా, చైనాలో విషంతో పోలుస్తారు. ఫ్రిజ్లో నిల్వ చేస్తే బ్యాక్టీరియా పెరుగుదల నెమ్మదిస్తుంది.


