News February 1, 2025
మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. మండలస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
Similar News
News October 27, 2025
FLASH: HYD: పెళ్లి కోసం చనిపోయాడు..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ PS పరిధిలో ఇంట్లో వారు <<18119524>>తనకు పెళ్లి చేయడం లేదంటూ<<>> ఈరోజు ఓ వ్యక్తి హైటెన్షన్ టవర్ పైనుంచి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ మాధవ్ తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు కాల్ చేయాలని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
News October 27, 2025
FLASH: HYD: పెళ్లి కోసం చనిపోయాడు..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ PS పరిధిలో ఇంట్లో వారు <<18119524>>తనకు పెళ్లి చేయడం లేదంటూ<<>> ఈరోజు ఓ వ్యక్తి హైటెన్షన్ టవర్ పైనుంచి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ మాధవ్ తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు కాల్ చేయాలని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
News October 27, 2025
తుఫాను తీరాన్ని తాకడం అంటే ఏంటి?

తుఫాను ఏర్పడినప్పుడు సముద్రంలోని సుడిగుండాల మధ్యలో ఉండే భాగాన్ని తుఫాను కన్ను (సైక్లోన్ ఐ) అంటారు. ఇది 50-60 కి.మీ పరిధిలో విస్తరించి ఖాళీగా ఉంటుంది. సైక్లోన్ ఐ తీరాన్ని (భూమిని) తాకితే <<18121128>>తుఫాను తీరాన్ని తాకిందని<<>> అర్థం. అది తీరాన్ని దాటే సమయంలో మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. వరదలు ముంచెత్తుతాయి. భీకర గాలులకు చెట్లు కూలిపోతాయి. సముద్రపు అలలు భూమిపైకి దూసుకొస్తాయి.


