News March 1, 2025
మహబూబాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

మహబూబాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 1, 2025
కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.
News November 1, 2025
దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకుల సేవలు

టీటీడీలో అమలవుతున్న శ్రీవారి సేవకుల సేవలను దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో అందించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. చెన్నై, హైదరాబాద్, వైజాగ్, కన్యాకుమారి, బెంగళూరులో మొదటి విడతగా శ్రీవారి సేవను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత దశల వారీగా అన్ని ఆలయాల్లో సేవలను విస్తృతం చేయనున్నారు.
News November 1, 2025
చిత్తూరు: 5 కేసుల్లో 9 మందికి ఉరి శిక్ష…!

చిత్తూరు కోర్టులో మొత్తం 5 ఉరి శిక్షలు పడ్డాయి. తాజాగా కటారి కేసులో ఐదుగురికి, 1988లో ఇద్దరిని హత్య చేసిన కేసులో ఒకరికి, 1992 హత్య కేసులో మరొకరికి శిక్ష పడింది. 2020లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఒకరికి, 2023లో మహిళ, ఆమె తల్లిని చంపిన కేసులో విధించారు.


