News February 28, 2025
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. శుక్రవారం కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీని కలెక్టర్ పరిశీలించి మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ లక్ష్మారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Similar News
News November 30, 2025
నలుగురు మంత్రులున్నా అభివృద్ధికి దూరంగా కొండగట్టు

ఉమ్మడి KNRలో కేంద్రమంత్రి, ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ కొండగట్టు దేవాలయం అభివృద్ధికి దూరంగా ఉంది. ఇప్పటికీ మాస్టర్ ప్లాన్ లేకపోవడం పాలకవర్గాల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. తాగునీరు, వసతి గృహాలు వంటి కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మంత్రులు దృష్టి సారించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయించి కొండగట్టును అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.
News November 30, 2025
APPLY NOW: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech/ BE, MSc, MCA ఉత్తీర్ణులై, 22- 45ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.64,820- రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bankofindia.bank.in/
News November 30, 2025
ఖమ్మం: పెళ్లి పనుల్లో విషాదం.. కరెంట్ షాక్తో యువకుడి మృతి

సింగరేణి మండలం బొక్కల తండా గ్రామానికి చెందిన అజ్మీర విజయ్(24) శనివారం సాయంత్రం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. తిరుమలాయపాలెంలో పెళ్లి డెకరేషన్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఐరన్ పైపుకు 33/11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ఘటన జరిగింది. విజయ్ అకాల మరణంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


