News January 27, 2025
మహబూబాబాద్ జిల్లా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ

మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లోని ,19 గ్రామాలకు చెందిన రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్ల 14 లక్షలను రైతు భరోసా పథకం కింద జమ చేసింది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న, గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో ఈ నగదును జమ చేసినట్లు అధికారులు తెలియజేశారు. రైతు భరోసా నిధులు జమ కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 9, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో ఫైనల్స్కు చేరిన ఉమ్మడి ADB జట్టు

నారాయణపేట జిల్లాలో ఈనెల 7 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి SGF అండర్-17 హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు ఫైనల్స్కు చేరింది. వివిధ జిల్లా జట్టులతో తలపడి ప్రతిభ కనబరిచింది. నేడు జరిగే ఫైనల్స్కు చేరిందని ఆదిలాబాద్SGF సెక్రెటరీ తెలిపారు. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేష్ అభినందించారు.
News November 9, 2025
రాష్ట్రస్థాయి పోటీలో ఫైనల్కు ADB జట్టు

నారాయణపేటలో జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ అండర్-17 బాలికల విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ఫైనల్కు చేరింది. సెమి ఫైనల్ మ్యాచ్లో కరీంనగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లలో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఘన విజయాలను నమోదు చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. జిల్లా జట్టుకు DEO రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.
News November 9, 2025
వికారాబాద్ బీజేపీ అధ్యక్ష పదవి జాప్యంపై ఉత్కంఠ

డాక్టర్ రాజశేఖర్రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినా, అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి కారణం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో భారీగా ఉత్కంఠ నెలకొంది.


