News April 3, 2024
మహబూబాబాద్: నలుగురి పై గృహ హింస కేసు నమోదు

అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపికరెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన మహేశ్వరికి కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన నాదెళ్ల నవజీవన్తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో నవజీవన్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
Similar News
News February 6, 2026
ఫార్మసీ అధికారుల సమస్యలను పరిష్కరిస్తాం: డీఎంహెచ్వో

ఫార్మసీ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు అదనపు పోస్టుల మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీఎంహెచ్వో డాక్టర్ బి. సాంబశివరావు తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల ఫార్మసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పోస్టుల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి అధికారులకు లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు.
News February 6, 2026
ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం వద్దు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు) కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. ఎన్నికల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో పోలింగ్ నిర్వహణ అత్యంత ప్రధానమైనదని, అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు.
News February 6, 2026
చిన్న పొరపాటు లేకుండా ఎన్నికలను నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల్లో చిన్న పొరపాటు లేకుండా అధికారులు సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. నర్సంపేటలోని జడ్పీ సెకండరీ స్కూల్లో పీవోలు, ఏపీవోలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఎన్నికల సామగ్రిని, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. పలు సూచనలు చేశారు.


