News March 18, 2025

మహబూబాబాద్‌: నిలిచిన పలు రైళ్లు..!

image

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News March 18, 2025

సూపర్ స్టైలిష్‌గా మెగాస్టార్.. లుక్ చూశారా?

image

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా నుంచి తాజాగా రిలీజైన స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. లుక్ సూపర్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని, ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

News March 18, 2025

HNK: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్‌గా ఎస్సీ అధ్యయన కేంద్రం విద్యార్థులు

image

తెలంగాణ షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్రం HNKకు చెందిన విద్యార్థులు పి.ప్రవీణ్, జి.శిరీష హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్‌గా సెలెక్ట్ ఐనట్లు SC అధ్యయన కేంద్రం సంచాలకులు Dr.K.జగన్మోహన్ తెలిపారు. వీరికి తెలంగాణ షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్రం చైర్పర్సన్ & జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఏ.శ్రీలత అభినందనలు తెలిపారు.

News March 18, 2025

వృత్తిని ప్రేమించి.. బాధ్యతగా పని చేయండి: అజయ్ రావు

image

వృత్తిని ప్రేమించి బాధ్యతగా పని చేయాలని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు అన్నారు. ఎక్సైజ్‌ శాఖలో మహిళా కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 129 మంది విధుల్లో చేరుతున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి.. శిక్షణలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

error: Content is protected !!