News March 18, 2025

మహబూబాబాద్‌: నిలిచిన పలు రైళ్లు..!

image

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News February 24, 2026

టెక్నాలజీతో నేరాల అదుపు: ఎస్పీ రాహుల్ మీనా

image

కోనసీమ జిల్లాలో కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో DSPలు, CIలు, SIలతో క్రైమ్ రివ్యూ నిర్వహించారు. నేరాల అదుపు, పెండింగ్ కేసుల పరిష్కారం, విచారణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా పెండింగ్ కేసులను త్వరగా ముగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 24, 2026

మావోయిజం ఎప్పటికీ అంతం కాదు: రాజిరెడ్డి

image

లొంగిపోతూ మల్లా రాజిరెడ్డి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. మావోయిజం ఎప్పటికీ అంతం కాదని DGP సమక్షంలోనే ప్రకటించారు. రాజ్యంగబద్ధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు మిగతా జీవితాన్ని వెచ్చిస్తానని తెలిపారు. తనకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం చెక్‌ను DGP నుంచి అందుకున్న తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూనే మావోయిస్టుల ట్రేడ్ మార్క్‌ను గుర్తుచేస్తూ పిడికిలి బిగించటంతో పోలీసు అధికారులందరూ ఒకేసారి నవ్వారు.

News February 24, 2026

అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్!

image

దేశవ్యాప్తంగా 14 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలకు HPV వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే Gardasil ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027 నాటికి 2.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాయి. <<19154747>>సర్వైకల్<<>> (గర్భాశయ) క్యాన్సర్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి.