News March 5, 2025
మహబూబాబాద్: నేడే పరీక్షలు.. ALL THE BEST

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,302 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 4,392, సెకండియర్లో 4,910 మంది విద్యార్థులు రాయనుండగా.. 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST
Similar News
News November 19, 2025
చెర్వుగట్టులో మార్పు మొదలు

తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రం, తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మార్పులు మొదలయ్యాయి. ప్రతి గురువారం మన గుడి.. స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమానికి ఈవో సాల్వాది మోహన్ బాబు శ్రీకారం చుట్టారు. ఆలయంలో చెత్త ఇక నుంచి ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఈవో దృష్టి సారించారు. పవిత్రమైన పుష్కరిణిని భక్తులు అపవిత్రం చేయకుండా సహకరించాలని ఆయన కోరారు.
News November 19, 2025
3.11 లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరలు: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన 3,11,922 మంది మహిళలు చీరలకు అర్హులని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించామని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 19, 2025
సిద్దిపేట: నిరంతరం కృషిచేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

శాస్త్రీయ విజ్ఞానంపై నిరంతరం కృషిచేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ప్రేరణ, బాల వైజ్ఞానిక ప్రదర్శినను నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్, ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, గ్రంథాలయ ఛైర్మన్ లింగమూర్తి హజరయ్యారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో 183 ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించారు.


