News March 18, 2025

మహబూబాబాద్: ‘పది’ పరీక్ష పదిలంగా!

image

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 8,194 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Similar News

News October 16, 2025

మద్దూరు: సంకంచెరువులో వ్యక్తి మృతి

image

మద్దూరు పట్టణ కేంద్రంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంకంచెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడి చేరుకొని మృతుడిని వెలికి తీసే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 16, 2025

ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

image

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

News October 16, 2025

MNCL: లొంగిపోనున్న మరో మావోయిస్టు నేత..?

image

అభయారణ్యంలోని మావోయిస్టులకు రోజురోజుకు గట్టి ఎదురుదెబ్బ తగలుతోంది. బుధవారం మహారాష్ట్రలో మల్లోజుల వర్గంలో లక్ష్మణచందాకు చెందిన మోహన్ బెల్లంపల్లికి చెందిన సరోజ లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మందమర్రికి చెందిన సింగరేణి కార్మిక సంఘం కార్యదర్శి బండి ప్రకాశ్ ఉరఫ్ బండి దాదా లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లొంగుబాటు చర్యలకుల మద్దతిస్తున్నట్లు సికాస పేరిట లేఖ విడుదలైంది.