News April 4, 2025

మహబూబాబాద్: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

Similar News

News November 27, 2025

NZB: జి.జి.కళాశాలలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు

image

స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న అవకాశాలు & అవరోధాలు”అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సును TU వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. టి. యాదగిరి రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.ఆర్.సాయన్న, ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త రామకృష్ణ, ప్రారంభించి, సావనీర్ ఆవిష్కరించారు.

News November 27, 2025

ములుగు జిల్లాలో ‘ఆమె’ ఓట్లే అధికం..!

image

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,29,159 ఓటర్లు ఉండగా, అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 7,461 మంది మహిళలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మంగపేటలో 19,913 మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కన్నాయిగూడెంలో 5,085 మహిళా ఓటర్లు ఉన్నారు.

News November 27, 2025

పీరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

image

పీరియడ్స్‌లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్‌, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్‌, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్‌స్మియర్‌, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, సోనోహిస్టరోగ్రామ్‌, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.