News April 4, 2025

మహబూబాబాద్: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

Similar News

News November 28, 2025

HYD: మంచినీరు వృథా చేస్తే.. కాల్ చేయండి!

image

HYDలో జలమండలి సరఫరా చేసే మంచినీటిని కార్లు, బైకులు కడగటానికి, రోడ్లు కడగటానికి ఉపయోగించడం, మోటార్లు పెట్టి నిర్మిస్తున్న ఇళ్లకు క్యూరింగ్ చేయడం లాంటివి చేస్తే కఠినంగా వ్యవహరించి భారీ జరిమానా వేస్తామని జలమండలి హెచ్చరించింది. ఎవరైనా చూస్తే వెంటనే ఫొటో తీసి, 155313, HMWSSB యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.

News November 28, 2025

నగదును ఎలా స్వీకరిస్తున్నారు?.. ఇలా త్రిపాఠి వాకబు

image

గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె మర్రిగూడ మండలం సరంపేట, శివన్నగూడెం, వట్టిపల్లి గ్రామాలలో పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు సమర్పించే నగదును ఎలా స్వీకరిస్తున్నారని ? అలాగే వారికి రశీదు ఇస్తున్నారా? అని కలెక్టర్ సిబ్బందిని అడిగారు.

News November 28, 2025

అల్లూరి: ‘కొత్త జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు తెలపాలి’

image

పోలవరం జిల్లా ఏర్పాటుపై కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం ప్రాథమిక ప్రకటన విడుదల చేశారు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ 8మండలాలు, చింతూరు డివిజన్ 4మండలాలు కలిసి కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రస్తుత నోటిఫికేషన్‌కు సంబంధించి జిల్లా ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తున్నామన్నారు. నోటిఫికేషన్ విడుదలైన 30రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని పేర్కొన్నారు.