News March 20, 2025
మహబూబాబాద్ మార్కెట్కు పోటెత్తిన ఎర్రబంగారం

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పోటెత్తింది. బుధవారం తేజ, తాలు రకం కలిపి 6,727 బస్తాల మిర్చి విక్రయాలు జరిగాయి. తేజ రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.13,639, కనిష్ఠ ధర రూ.9,500 తాలు రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,350, కనిష్ఠ ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News December 6, 2025
కొర్రగుంటపాలెం పంచాయతీ కార్యదర్శిపై DLPO విచారణ

ముదినేపల్లి మండలం కొర్రగుంటపాలెం పంచాయతీ కార్యదర్శి జె.గిరిజ 15వ ఆర్ధిక సంఘం నిధులు దుర్వినియోగం చేసినట్లు గ్రామస్తులు చంద్రకాంత్.. కలెక్టర్కు చేసిన ఫిర్యాదుపై శుక్రవారం విచారణ చేపట్టారు. DLPO అమ్మాజీ పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించి వివరాలు సేకరించారు. కార్యదర్శి గిరిజ తనకు అనుకూలమైన వారిని వెండర్లుగా సృష్టించి ఆర్ధిక సంఘం నిధులను దుర్వినియోగం చేసినట్లు చంద్రకాంత్ DLPOకు తెలిపారు.
News December 6, 2025
టర్కీ కోళ్ల రకాలు – ప్రత్యేకతలు

☛ బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్: ఈ టర్కీ కోళ్ల ఈకలు నల్లగా ఉండి తోక చివరి భాగంలో మాత్రం తెల్ల రంగులో ఉంటాయి.
☛ బ్రాడ్ బ్రెస్టెడ్ లార్జ్ వైట్: ఈ తెలుపు రంగు టర్కీలు భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఇవి వేడిని తట్టుకోగలవు. డ్రెస్సింగ్ తర్వాత శుభ్రంగా కనిపిస్తాయి.
☛ బెల్టస్విల్లే స్మాల్ వైట్: ఈ రకం టర్కీ కోళ్లకు గుడ్ల ఉత్పత్తి, గుడ్డు పొదిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
News December 6, 2025
పుతిన్కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆయనకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత కశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మార్బుల్ చెస్ బోర్డు, మహారాష్ట్ర హస్త కళాకారులు చేత్తో చేసిన వెండి గుర్రం, ముర్షిదాబాద్కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటి బహుమతులు అందజేశారు.


