News March 20, 2025

మహబూబాబాద్ మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం

image

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పోటెత్తింది. బుధవారం తేజ, తాలు రకం కలిపి 6,727 బస్తాల మిర్చి విక్రయాలు జరిగాయి. తేజ రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.13,639, కనిష్ఠ ధర రూ.9,500 తాలు రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,350, కనిష్ఠ ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News March 28, 2025

జగిత్యాల: మెరుగైన విద్యుత్ అందించడానికి లైన్లలో కెపాసిటర్ల బిగింపు : SE

image

జగిత్యాల సర్కిల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి విద్యుత్ లైన్లలో కెపాసిటర్లను అమర్చుతున్నామని జగిత్యాల జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియానాయక్ గురువారం తెలిపారు. వోల్టేజ్ లో విద్యుత్ హెచ్చు తగ్గులు లేకుండా కెపాసిటర్లు ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటివరకు 41 కెపాసిటర్లు బిగించామని తెలిపారు. వీటివల్ల ట్రాన్స్ఫార్మర్స్‌పై లోడ్ తగ్గి మోటార్లు కాలిపోకుండా ఉంటాయి

News March 28, 2025

రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

image

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.

News March 28, 2025

ఓదెల మల్లన్న ఆలయ హుండీ ఆదాయం రూ.33,59,130

image

ఓదెల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయ హుండీ లెక్కింపును నిర్వహించారు. 3 నెలల ఆదాయం రూ.33,59,130, మిశ్రమ బంగారం 40.900 గ్రాముల, 7.200 కేజీల వెండి వచ్చిందని ఆలయ ఈవో సదయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక అధికారి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, అర్చకులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవా సమితి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!