News March 10, 2025

మహబూబాబాద్: మార్చి 20 వరకు దరఖాస్తుల పొడగింపు

image

తెలంగాణ రాష్ట్రం మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణను పొడిగించింది. మార్చి20 వరకు పొడిగించినట్లు అనంతారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉపేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 7-10 తరగతులలో మిగిలిన సీట్ల కోసం మార్చి 20 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

జగిత్యాల: యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లకు ప్రోసీడింగ్‌లు అందజేత

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రోసీడింగ్‌లను అందజేశారు. ఇటీవల జగిత్యాల పట్టణం, పలు మండలాలకు కొత్తగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి ఆయన ఈ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

News September 16, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

image

కెపాసిటీ బిల్డింగ్ పై ఉపాధ్యాయులకు ఈనెల 17 నుంచి 20 వరకు డివిజన్ల వారిగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 17న ఖేడ్ 18న జహీరాబాద్, 19న సంగారెడ్డి, 20న పటాన్ చెరు డివిజన్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని సూచించారు.

News September 16, 2025

KTRతో సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా BRS నేతలు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన BRS ముఖ్య నేతలు తెలిపారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన BRS సన్నాహక సమావేశం హైదరాబాదులో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన MLCలు పోచంపల్లి శ్రీనివాస్, తక్కలపల్లి రవీందర్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.