News January 24, 2025

మహబూబాబాద్: రేపటి నుంచి అండర్ బ్రిడ్జ్ మూసివేత

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జ్‌ను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. మూడో రైల్వే లైన్ నిర్మాణం పనుల కోసం గాను జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 తేదీ వరకు మహబూబాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జిని మూసివేయనున్నారు. అండర్ బ్రిడ్జి మూసివేయడం ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.

Similar News

News November 27, 2025

WNP: రిటర్నింగ్‌ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్‌ అధికారులకు (RO) కీలక సూచనలు చేశారు. నిర్దేశించిన పత్రాలు లేని అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించకుండా, వారికి గడువుతో కూడిన నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. నామినేషన్లను పక్షపాతం లేకుండా, జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.

News November 27, 2025

పెళ్లి చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్

image

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇవాళ జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు, ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్య రెడ్డి. ఇటు ఎన్నో పాపులర్ పాటలు పాడిన రాహుల్ ‘నాటు నాటు’ సాంగ్‌తో ఆస్కార్ స్థాయికి ఎదిగారు.

News November 27, 2025

ఈ కంపెనీల అధిపతులు మనవాళ్లే!

image

ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే అధిపతులుగా ఉన్నారు. అందులో కొందరు.. ఆల్ఫాబెట్ Google- సుందర్ పిచాయ్, Microsoft-సత్య నాదెళ్ల, Youtube-నీల్ మోహన్, Adobe -శంతను నారాయణ్, IBM-అరవింద్ కృష్ణ, Novartis -వసంత్ నరసింహన్, Micron Technology- సంజయ్ మెహ్రోత్రా, Cognizant- రవి కుమార్, వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్- రేష్మా కేవల్‌రమణి, Infosys-సలీల్ పరేఖ్, World Bank-అజయ్ బంగా.