News January 24, 2025
మహబూబాబాద్: రేపటి నుంచి అండర్ బ్రిడ్జ్ మూసివేత

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జ్ను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. మూడో రైల్వే లైన్ నిర్మాణం పనుల కోసం గాను జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 తేదీ వరకు మహబూబాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జిని మూసివేయనున్నారు. అండర్ బ్రిడ్జి మూసివేయడం ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.
Similar News
News October 31, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

★ పల్లెల అభివృద్దే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే కూన
★సారవకోట: దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్
★ పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు అశోక్, శంకర్
★ కోటబొమ్మాళిలో చెట్టుకు ఉరివేసుకుని ఒకరు సూసైడ్
★ లావేరులో అగ్నిప్రమాదం..మూడు పూరిళ్లు దగ్ధం
★ పాతపట్నం: రాళ్లు తేలిన ఆల్ ఆంధ్రా రోడ్డు
★ జిల్లాలో పలుచోట్ల పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీలు 
News October 31, 2025
SRCL: ఏరియల్ సర్వేలో పాల్గొన్న కలెక్టర్లు

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, అరవింద్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడంపై చర్చించారు.
News October 31, 2025
సిరిసిల్ల అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడితో ఫ్రాన్స్ అమ్మాయికి శుక్రవారం ఘనంగా వివాహం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చ చైతన్య గౌడ్ ఉద్యోగరీత్యా ఫ్రాన్స్ ఉంటున్నాడు. అక్కడ యువతి శాన్వి (ఇమాన్ బెన్)తో ప్రేమలో పడ్డాడు. పెద్దల అంగీకారంతో శుక్రవారం అబ్బాయి ఇంటి ముందు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.


