News February 17, 2025
మహబూబాబాద్: రేపు జిల్లా వ్యాప్తంగా సీపీఐ నిరసనలు: విజయ్ సారథి

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించకుండా తాత్సారం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో అమలు చేయడంలేదన్నారు.అందుకు రేపు జిల్లాలో నిరసనలు చేపడుతున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలన్నారు.
Similar News
News November 18, 2025
ములుగు: పోలీసుల అదుపులో దేవ్ జీ..?

ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఉన్నట్లు తెలుస్తోంది. మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నంబాల కేశవరావుకు సంబంధించిన సెక్యూరిటీతో పాటు మరి కొంత మంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వినవస్తుంది. రేపు వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
News November 18, 2025
పెనాల్టీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: మేయర్

అసెస్మెంట్లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల 25 రెట్లు పెనాల్టీ నమోదైన నగర వాసులు, ఈ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. మంగళవారం బల్దియా కౌన్సిల్ హాల్లో రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై జరిగిన సమావేశంలో ఆమె అధికారులకు సూచనలు చేశారు.
News November 18, 2025
గద్వాల్: హంద్రీ ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే హంద్రీ EXPRESS నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు మహబూబ్నగర్ రైల్వే ఎస్సై కే.రాజు తెలిపారు. దివిటిపల్లి బ్రిడ్జి రైల్వే లైన్ సమీపంలో డెడ్బాడీ లభించింది. మృతుడికి (25) ఉండవచ్చునని, రన్నింగ్ ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు గుర్తించారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే సెల్ నంబర్ 8712658597 సమాచారం ఇవ్వాలన్నారు.


