News February 17, 2025
మహబూబాబాద్: రేపు జిల్లా వ్యాప్తంగా సీపీఐ నిరసనలు: విజయ్ సారథి

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించకుండా తాత్సారం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో అమలు చేయడంలేదన్నారు.అందుకు రేపు జిల్లాలో నిరసనలు చేపడుతున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలన్నారు.
Similar News
News November 22, 2025
ఏలూరు జిల్లాకు ఈనెల 24న రానున్న పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.
News November 22, 2025
ఏలూరు జిల్లాకు ఈనెల 24న రానున్న పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎందుకు చేస్తారు?

ఏడు శనివారాల వ్రతాన్ని ప్రధానంగా శని గ్రహ దోషాల నివారణ కోసం చేస్తారు. అలాగే ఏడు కొండలవాడైన వేంకటేశ్వరస్వామి దయను పొందడం కోసం ఆచరిస్తారు. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని చేస్తే.. ఇంట్లో సమస్యలు, అప్పుల బాధలు పోతాయని నమ్మకం. వ్రత ప్రభావంతో అనుకున్న పనులన్నీ సవ్యంగా నెరవేరుతాయని భావిస్తారు. వ్రతం పూర్తయ్యాక ముడుపును తీసుకుని తిరుమల వెంకన్నను దర్శించుకుంటే కష్టాలు కొండెక్కిపోతాయని ప్రగాఢ విశ్వాసం.


