News April 5, 2025

మహబూబాబాద్ వాసులూ.. APPLY చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను మహబూబాబాద్ జిల్లాలోని మీ MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News November 19, 2025

ఏలూరు: పోలింగు కేంద్రాలు మార్పులు, చేర్పులపై సమీక్ష

image

జిల్లాలో ఖచ్చితత్వం‌తో కూడిన ఓటర్ల జాబితాపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో ఇప్పటికే 1,744 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 5 పోలింగ్ స్టేషన్లు నామకరణం మార్పు కోసం ప్రతిపాదనలు, 23 పోలింగ్ స్టేషన్లు స్థానమార్పు కోసం ప్రతిపాదనలు, 137 క్రొత్త పోలింగ్ స్టేషన్లు కోసం ప్రతిపాదనలు అందాయని అన్నారు.

News November 19, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

image

భారత సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 513 పాయింట్లు పెరిగి 85,186.47(0.61%) వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 26,052.65(0.55%) వద్ద క్లోజ్ అయ్యింది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరగ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పడిపోయింది. ఓవరాల్‌గా BSE లిస్టెడ్ కంపెనీలు రూ.474.6 లక్షల కోట్ల నుంచి రూ.475.6 లక్షల కోట్లకు చేరాయి. అంటే సింగిల్ సెషన్‌లోనే రూ.లక్ష కోట్లకు పైగా లబ్ధి పొందాయి.

News November 19, 2025

BREAKING: ఖాతాల్లో రూ.7,000 జమ

image

AP: పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని మోదీ TNలోని కోయంబత్తూరులో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో దేశంలో అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమయ్యాయి. అటు కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను రిలీజ్ చేశారు. దీంతో రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో యాడ్ అయ్యాయి. మొత్తంగా రూ.7 వేల చొప్పున జమయ్యాయి.