News March 7, 2025
మహబూబాబాద్: విషాదం.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జలగం అన్వేశ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవికుమార్ ఈరోజు తెలిపారు.కొంతకాలంగా అన్వేశ్ మద్యానికి బానిసవగా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతడు ఉరేసుకుని చనిపోయాడని తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News September 18, 2025
భూపాలపల్లిలో పువ్వుల పండుగ జరిగేది ఇక్కడే..!

ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలకు భూపాలపల్లి జిల్లా సిద్ధం అవుతోంది. రసంకుంట(గోరి కొత్తపల్లి), గణపేశ్వరాలయం(గణపసముద్రం), మామిడి కుంట చెరువు(చిట్యాల), దామెర చెరువు(రేగొండ), నైన్పాక ఆలయం(చిట్యాల), అయ్యప్ప దేవాలయం(కాటారం), టెకుమట్ల చెరువు, కాళేశ్వరం(మహదేవపూర్)తో పాటు పలిమెల, మల్హర్ మండలాల్లోని పలు చోట్ల వేడుకలు ఘనంగా జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయో లొకేషన్ కామెంట్ చేయండి.
News September 18, 2025
పాలమూరు RTCలో ఉద్యోగాలు

సుదీర్ఘ విరామం తర్వాత <<17746081>>ఆర్టీసీలో ఉద్యోగాల<<>> భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి MBNR రీజియన్లో ఖాళీలు ఇలా ఉన్నాయి. MBNRలో డ్రైవర్ 20, శ్రామిక్ పోస్టులు 5, NGKLలో డ్రైవర్ 20, శ్రామిక్ 2, GWLలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, WNPలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, NRPTలో డ్రైవర్ 13, శ్రామిక్ 3 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
-SHARE IT
News September 18, 2025
తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.